హైదరాబాద్ : ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. జన నాట్యమండలి స్థాపించి జనం కోసం గొంతెత్తి, పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాగాయకుడని పేర్కొన్నారు.
ప్రజాయుద్ధనౌక గద్దర్ నిష్క్రమణ తీరని లోటని అన్నారు. భౌతికంగా దూరమైనా గద్దర్ జ్ఞాపకాలు పాటల రూపంలో నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని వెల్లడించారు. ‘పోరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా’ జోహర్ గద్దర్ అంటూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.