హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించే ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్’లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం చెన్నైకి వెళ్లనున్నారు. ‘సార్వత్రిక ఎన్నికలు-2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అంశంపై నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగిస్తారు. రాత్రి 7.30 గంటలకు జరిగే చర్చావేదికలో పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. చర్చలో ఎమ్మెల్సీ కవితతోపాటు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై తదితరులు పాల్గొననున్నారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్భగత్ సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.