హైదరాబాద్ : తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిప్రేమను చూపుతోందని, ఈ విషయం మరోసారి బహిర్గతమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాసంగిలో తెలంగాణ అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్సీఐకి తెలిసినా రా రైస్ మాత్రమే కొంటామని మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
రైతులు పండించే పంటను కొనకుండా, పండని పంటను కొంటామంటూ ప్రకటించి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయం గురించి ఏ మాత్రం అవగాహన లేని బండి సంజయ్.. యాసంగిలో రాష్ట్రంలో ఏ రకం బియ్యం ఉత్పత్తి అవుతాయో తెలుసుకోవాలని సూచించారు. ఆనయకు తెలియకపోతే రాష్ట్రంలో ఏ రైతును అడిగినా జ్ఞానోదయం చేయిస్తారన్నారు. ఆయన అర్ధజ్ఞానంతో అన్నదాతలకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందంటూ ట్వీట్ చేశారు.
రాష్ట్ర రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ మరోసారి బయటపడింది. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది 1/3
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 27, 2022