MLC Kavitha | అగ్రవర్ణాలకు సంబంధించిన సీఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను అవమానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది చాలా దౌర్భాగ్యమని.. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆమె సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ లో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడుకి వినతిపత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారని గుర్తు చేశారు. అప్పుడు ఓపికపట్టామని.. ఇవాళ సాక్షాత్తు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా భట్టి విక్రమార్కను అవమానించారన్నారు. సీఎం వెంటనే భట్టి విక్రమార్క, కొండా సురేఖలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
ఇవాళ మహిళలకు 47శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్రెడ్డి అబద్ధాలు చెప్పారన్నారు. గురుకులాల్లో 85శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ జీవో ఇచ్చారని.. దాన్ని కాంగ్రెస్ తీసివేసిందన్నారు. సీఎం చెప్పేవన్నీ అబద్ధాలేనని.. యువతను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. విద్యార్థులను మోసం చేయొద్దని.. బీసీలకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందు కోసమే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కులగణన విషయంలో కాలయాపన చేయొద్దని.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్నారు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకు ముందే 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అందరికీ అండగా తాము అండగా ఉంటామని.. జై భీం.. జై బీసీ, జై పూలే నినాదంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.