నిజామాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకొన్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్కుమార్ దంపతులు సొంత ఖర్చుతో కొండూర్లో నిర్మించిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నారసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠానోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆరు రోజులపాటు ధార్మిక క్రతువులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ నూతన నిర్మాణ ప్రదేశంలో యాగశాలలను నిర్మించారు. రుత్వికులు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రారంభోత్సవానికి కవిత, అనిల్ దంపతులు పలువురికి ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. అతిథులు, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.