హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ పాలసీ అంశంలో అరెస్టయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై ఈనెల 6న తీర్పు వెలువడనున్నది. సీబీఐ, ఈడీలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అభియోగాలు మోపడం, రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత తరఫున గురువారం న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరి బవేజా తుది తీర్పును ఈనెల 6కు వాయిదా వేశారు.