రాయికల్, జనవరి 9: ఆపదలో ఉన్నవారిని నేనున్నా అంటూ ఆదుకొనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి పెద్దమనసు చాటారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న తొమ్మిదేండ్ల బాలుడి చికిత్సకు భరోసా ఇచ్చారు. మూడు విడతల్లో రూ.8 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన షేక్ గౌస్-ఆస్మా దంపతుల కొడుకు ముతీర్ రెహ్మాన్ రెండేండ్ల క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. బ్రెయిన్ ట్యూమర్గా నిమ్స్ వైద్యులు నిర్ధారించారు. పేదలైన తల్లిదండ్రులు చికిత్స చేయించే స్థోమతలేక తల్లడిల్లారు. జగిత్యాల జిల్లా తెలంగాణ జాగృతి యూత్ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్ బాలుడి దయనీయస్థితిని కవితకు ట్విట్టర్ ద్వారా వివరిం చగా, ఆమె చలించిపోయారు. చికిత్స కోసం విడతల వారీగా రూ.8 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు.