హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగా ణ): ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని, ఆత్మ బలిదానాలను అవమానించిన కాంగ్రెస్పై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. తెలంగాణ అమరుల త్యాగాలను పూచికపుల్లలా తీసిపడేసేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నే త, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేసింది. ‘ఆత్మహత్య అనేది దురదృష్టకర ఘటన. ప్రజా ఉద్యమంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అందుకు సారీ’ అన్న చిదంబరం వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజానీకం ఫైర్ అయింది. ‘కాంగ్రెస్ కృరత్వాలను రాష్ట్రం క్షమించదు, మరిచిపోదు. రాష్ట్ర ఏర్పాటు ఆలసత్వం పై కాంగ్రెస్ చేసిన తప్పులు వారిని వెం టాడుతూనే ఉంటా యి.
వారి చేతులకు అంటిన రక్తం మరకలు వెంటాడుతూనే ఉంటాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘తెలంగాణ అమరవీరుల తల్లుల కడుపుకోతపై చిదంబరం కారం చల్లినట్టు ఉన్నది. అమరుల తల్లుల శోకం కాంగ్రెస్కు శాపంగా మారుతుంది. జలియన్వాలాబాగ్లో వెయ్యి మందిని కాల్చిచంపిన డయ్యర్ క్షమాపణ చెప్తే ఎట్లా ఉంటుందో.. చిదంబరం సారీ చెప్పినా అట్లనే ఉన్నది. కాంగ్రెస్ నాయకులను ప్రజాకోర్టులో నిలబెట్టి అమరవీరుల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా తక్కువే’ అని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
‘గ్యారెంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా? ఆరు దబాబ్దాలపాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా ప్రజలకు క్షమాపణ చెప్పలేరా? పదేండ్లలో ఒక్కసారి మీ కుటుంబానికి వందల మం ది తల్లుల కడుపుకోత గుర్తుకు రాకపోవడం బాధాకరం. సోనియా, రాహుల్గాంధీలు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నమస్కరించినా/ నివాళులర్పించినా వారి పాపాలకు విముక్తి లభించదు’ అని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరా డి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ‘కాంగ్రెస్ వేసిన భిక్ష’గా పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు అవమానించడంపై నెటిజన్లు సైతం మండిపడ్డారు. ఉద్యమ బలిదానాలకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదన్న వాదనలపైనా నిప్పులు చెరిగారు. శుక్రవారం ట్విట్టర్లో ‘కాంగ్రెస్ మర్డరర్స్’ హ్యాష్ట్యాగ్తో కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కొంత సేపు ఈ హ్యాష్ట్యాగ్ దేశంలోనే టాప్ ట్రెండింగ్గా నిలిచింది.