హైదరాబాద్, నమస్తే తెలంగాణ ;కత్తిదాడికి గురై యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు బుధవారం పరామర్శించారు. వైద్యులను అడిగి ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన సతీమణి, కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.