గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ సర్కారుతోపాటు సీఎం కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేసేందుకు తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై కవిత గురువారం ట్విటర్ వేదికగా స్పందించారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించిన నేపథ్యంలో గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని పేర్కొన్నారు.