హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ నెల 11, 12 తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసోం రాష్ట్రం గౌహతిలోని కామాఖ్య ఆలయంలో అమ్మవారిని దర్శించుకోనున్నారు.
తిరిగి వచ్చాక ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొననున్నారు. 13న జగిత్యాలలో, 14న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో, 15న కామారెడ్డిలో ఆమె పర్యటించనున్నారు.