హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి.. పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ మేరకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. తనపై ఉంచిన బాధ్యతలను ఆశించిన స్థాయిలో నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.