హైదరాబాద్ : శాసనమండలి చైర్మన్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సుఖేందర్ రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మండలి చైర్మన్గా రెండోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ పదవి ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగా మండలిని హుందాతనంగా నడిపేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే కోటా నుంచి శాసనమండలికి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
మండలి చైర్మన్ పదవి ఎన్నికకు సంబంధించి నిన్న షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. 2019, సెప్టెంబర్ 11న తొలిసారిగా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2021, జూన్ మొదటి వారం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా స్వీకరించారు. గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో.. ఆయన స్థానంలో ప్రొటెం చైర్మన్గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం మండలి ప్రొటెం చైర్మన్గా ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ కొనసాగుతున్నారు.