సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 08 : డిసెంబర్ 10న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం నుంచి సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, సీపీ జోయల్ డేవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు, హెల్త్ వర్కర్లను నియమించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ఫోన్లను అనుమతించకూడదన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని తెలిపారు.
ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించుటకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమీషనర్కు సూచించారు. పోలింగ్ సామాగ్రితో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటపుడు, పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్స్లతో రిసెప్షన్ సెంటర్కు వచ్చేటపుడు బందోబస్తుతో రావాలన్నారు.
ఓటర్ల గుర్తింపు కార్డులు లేదా భారత ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డులలో ఏదేని ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ అధికారులు ఇచ్చే వయోలెట్ పెన్నుతోనే బ్యాలెట్ పేపర్పై ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు చెప్పాలన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ నెల 14వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తీన్మార్ మల్లన్న జర్నలిస్టే కాదు : మంత్రి కొప్పుల
రైతు సంఘాల కమిటీకి సర్కార్ తాజా ప్రతిపాదన : నిర్ధిష్ట హామీలకు ఎస్కేఎం పట్టు
Nallagonda | సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
కుప్పకూలిన హెలికాప్టర్లో బిపిన్ రావత్ : వాయుసేన