హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకర్గంలో పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన పూర్తయ్యింది. చెల్లుబాటు అయ్యేవి, కాని పోస్టల్ బాలెట్లను ఎన్నికల సిబ్బంది వేరుచేశారు. బ్యాలెట్ బాక్సుల సీల్ను పరిశీలించిన అధికారులు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో వాటిని ఓపెన్ చేశారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ టేబుళ్లపైకి తరలిస్తున్నారు.
కాగా, నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గం ఓట్లలో ఇప్పటివరకు 60 శాతం బ్యాలెట్లను సిబ్బంది బండిల్స్ కట్టారు. సాయంత్రం 5 గంటల వరకు బండిల్స్ ప్రక్రియ పూర్తికానుంది. దీంతో తుది ఫలితం రావడానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నది.