బోథ్, జనవరి 27: పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను వినిపించే సత్తా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని ఎమ్మెల్సీ, గాయకుడు దేశపతి శ్రీనివాస్ చెప్పారు. శనివారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో భాగంగా బోథ్లో నిర్వహించిన ని యోజకవర్గస్థాయి సమావేశంలో దేశపతి మా ట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దశాబ్దకాలంగా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు వేల సంఖ్య లో ప్రశ్నలు లేవనెత్తారని గుర్తుచేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇక్కడి ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇటీవలే ప్రధాని మోదీని సీఎం రేవంత్రెడ్డి కలిసిన అనంతరం బీఆర్ఎస్ను ఫినిష్ చేద్దాం అని కుట్ర పన్నుతున్నాయనే వార్తను ఓ పత్రిక ప్రచురించిందని గుర్తు చేశారు. తెలంగాణ గొంతుకైన బీఆర్ఎస్ను ప్రజల నుంచి ఎవరూ దూరం చేయలేరని పేర్కొన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించడానికి ప్రజలు సమయత్తం అవుతున్నారని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్, బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్, మాజీ ఎంపీ గడ్డం నగేశ్, ఆత్రం సక్కు, జాన్సన్నాయక్ పాల్గొన్నారు.