కోరుట్ల, మార్చి 12: కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తనపై బురద జల్లుతున్నాడని, దమ్ముంటే అవినీతిని నిరూపించాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుం ట్ల విద్యాసాగర్రావు సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయలేదని స్పష్టం చేశారు. డబ్బులు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేసినట్టు నిరూపిస్తే కోరుట్ల అంబేద్కర్చౌరస్తా వద్ద ఉరేసుకుంటానని ఆనాడే ప్రకటించానని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసు లో జైలుకెళ్లిన రేవంత్ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. కోరుట్లలోని తన క్యాం పు కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆదివారం ఆ యన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకనే అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు.