మహబూబ్నగర్ : తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చీరెల పంపిణీ చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ..కరోనా ముప్పు ఇంకా తప్పలేద్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.