వేల్పూర్/బాన్సువాడ, జనవరి 22: అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రామాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఊరూరా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ రామాలయంలో నిర్వహించిన పూజల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్య కరసేవకులను సన్మానించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, వర్ని, మోస్రా మండలాల్లోని రామాలయాల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు.