హైదరాబాద్ : మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. ఆదివారం సంక్రాంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా(People’s Plaza)లో కైట్ ఫెస్టివల్(Kite Festival)లో పాల్గొన్నారు. చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి పతంగిని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మన ఆచారాలు, సంప్రదాయాలను పెంపొందించే పండుగలను ఘనంగా జరుపుకోవాలన్నారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.