హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆనాడు మా అమ్మ (తెలంగాణ)ను కొనడానికి మా ఇంటికి వచ్చాడు’ అని నామినేటె డ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ చెప్పారు. ‘ఐదు కోట్లు ఇస్తాం, మీ అమ్మ (తెలంగాణ)ను అమ్ము అని అన్నాడు. 500 కోట్లు ఇచ్చినా అమ్మను అమ్మబోనని స్పష్టంగా చెప్పాను’ అని తెలిపారు. స్టీఫెన్సన్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ఎవరైనా అమ్మను అమ్ముతారా? మీరే చెప్పండి’ అని ప్రశ్నించారు. మన తల్లి (తెలంగాణ)ని కాపాడుకోవాలి అని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చినంక తమ బాధలు తీరాయని చెప్పారు. రా ష్ట్రాన్ని నాశనం చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయని అన్నారు. తల్లిని కొనేటోల్లు రాష్ట్రానికి ఏమీ చేయలేరని, వారికి పైసలే ముఖ్యమని చెప్పారు. తెలంగాణ వచ్చాక క్రైస్తవులకు ఎంతో మేలు జరిగిందని, రెసిడెన్షియల్ స్కూ ల్స్ వచ్చాయని, సంక్షేమ పథకాలు, క్రిస్మస్కు సంబురాలు, దుస్తుల పంపిణీ, డిన్నర్ ఇస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నదని, మరోసారి కేసీఆర్ను గెలిపిస్తే అన్నీ సాధ్యమవుతాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో జరిగిన శాసనమండలి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించేందుకు నాడు ఆ పార్టీ సభ్యునిగా ఉన్న రేవంత్రెడ్డి ‘ఓటుకు నోటు’ అక్రమాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకొనేందుకు జరిగిన ఆ ఎన్నికల్లో నామినేటెడ్ శాసనసభ్యునిగా ఉన్న స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు రేవంత్రెడ్డి రూ.50 లక్షల డబ్బు తో ఆయన ఇంటికి వెళ్లారు. డబ్బు ఆశకు లొంగేందుకు నిరాకరించిన స్టీఫెన్సన్ పోలీసులకు ఫిర్యాదుచేసి రేవంత్ను రెడ్ హ్యాండెడ్గా పట్టించారు. ఈ ఘటన ‘ఓటుకు నోటు’ కేసుగా ప్రసిద్ధి చెందింది.