ములుగు రూరల్, నవంబర్ 9 : రాష్ట్ర విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా ములుగు జిల్లాకేంద్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సీతక్క కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తరగతులను ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.
బుధవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించాలనే డిమాండ్తో ఈ నెల 12న గట్టమ్మ దేవాలయం నుంచి ములుగు జిల్లాకేంద్రం వరకు నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన వర్సిటీ కోసం రూ.800 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటన చేసి ఆరేండ్లు పూర్తయినా ఇప్పటివరకు గిరిజన వర్సిటీ ఏర్పాటుకు నోచుకోలేదన్నారు.