వేంసూరు, ఆగస్టు 30: రాష్ట్రంలో పేదరికమే గీటురాయిగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ పథకం భరోసానిస్తోందని అన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు సీఎం కేసీఆర్ కానుకగా అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మండలంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను దుద్దేపూడి, భీమవరం, లింగపాలెం, ఎర్రగుంటపాడు, చౌడవరం తండా, పల్లెవాడ, చౌడవరం, వేంసూరు, మర్లపాడు, లచ్చన్నగూడెం, కల్లూరుగూడెం, రాయుడుపాలెం పంచాయతీల్లో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారని అన్నారు. వేంసూరు మండలంలో 1,976 మందికి నూతనంగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయన్నారు. పగుట్ల వెంకటేశ్వరరావు, మారోజు సుమలత, పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, ప్రసాద్, వెల్ది జగన్మోహన్రావు, పుచ్చకాయల శంకర్రెడ్డి, వీరేశం, ముజాహిద్, చలంచర్ల వెంకటేశ్వరరావు, రామ్మోహన్రావు, రంజిత్కుమార్, వాసు తదితరులు పాల్గొన్నారు.
వేంసూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. అనంతరం వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన క్రికెట్ పోటీల్లోని విజేతలకు ఎమ్మెల్యే సండ్ర ఫ్రీడం కప్ను అందజేశారు. అడసర్లపాడు, కల్లూరుగూడెం పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయురాళ్లు చంద్రకళ, లలితలను సన్మానించారు.