రంగారెడ్డి : ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం ఎమ్మల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy )తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బుధవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, కాసోజు ప్రశాంత్ చారి, ఎగ్గిడి గణేష్, రామకృష్ణ, కందుకూరు మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి తదితరులు ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తనపై నమ్మకం ఉంచి కష్టపడి గెలిపించిన వారందరి రుణం తీర్చుకుంటానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కారిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.