మహబూబాబాద్ : ప్రజలు మళ్లీ కేసీఆర్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. నా రాజకీయ జీవితంలో డజను మంది ముఖ్యమంత్రులను దగ్గరగా చూసిన కానీ, సీఎం కేసీఆర్(CM KCR) వంటి విజన్ ఉన్న నాయకుడిని చూడలేదని డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రెడ్యా నాయక్(MLA Redya Naik )అన్నారు. మంగళవారం డోర్నకల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)లో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెడ్యా నాయక్ మాట్లాడుతూ..మరిపెడలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్నారు. దళితబంధును నియోజకవర్గంలో ఒకేసారి అందించేలా చూడాలన్నారు. అలాగే డోర్నకల్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని, మరిపెడలో వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఐదు కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. డోర్నకల్లో వంద పడకల దవాఖాన ఏర్పాటు చేయాలని కేసీఆర్ను కోరారు.