నల్లగొండ : పార్కులను, ఓపెన్ జిమ్స్లను సద్వినియోగం చేసుకోవాలి అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని 15వార్డులో రూ.10లక్షలతో ఏర్పాటు చేస్తున్న పార్కు పనులకు, రూ.8లక్షలతో చేపడుతున్న ఓపెన్ జిమ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ఆయన అన్నారు. ఓపెన్ జిమ్స్, పార్కులతో ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణం లభిస్తుందని పేర్కొన్నారు.
దశలవారీగా పట్టణంలో అన్ని వార్డులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్ అలీ, కౌన్సిలర్లు పొన్నబోయిన సైదులు, మహ్మద్ రైస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ,కమిషనర్ వెంకటయ్య, ఏఈ రాజు, తౌఫిక్ ఖాద్రీ, ఇలియస్, జావిద్ ముక్తి, జానీబాబా, బురాన్, పొట్ట మధు, జావిద్, ఆఫ్రోజ్, అజిమ్, జమీర్, జకీర్, వేముల కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.