నల్లగొండ : అన్ని వర్గాలను కాపాడుకునే, అన్ని మతాలను గౌరవించే నాయకుడు సీఎం కేసీఆర్ అని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో రూ.14.22లక్షలతో చేపడుతున్న ముస్లిం, మైనార్టీల ఖబరస్థాన్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడంతో పాటు మైనార్టీల సంక్షేమంలోనూ తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అని ఆయన అన్నారు.
కుల,మతాల ఐక్యతను పెంచిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఆయన కొనియాడారు. నాడు ఉమ్మడి పాలనలో మైనార్టీలకు కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుని కుల, మత పంచాయతీలను ప్రోత్సహించారు తప్పా వారికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతను కల్పించి అక్కున చేర్చుకుని అండగా నిలుస్తున్నామన్నారు.
పేదలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మైనార్టీ బంధు అందిస్తుంది అని ఆయన చెప్పారు. మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో ప్రత్యేక నిధులు వెచ్చించి వారిని ఆదుకుంటున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్ అలీ, కమిషనర్ వెంకటయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, కౌన్సిలర్లు పొన్నబోయిన సైదులు, మహ్మద్ రైస్, ముదవత్ జయప్రకాష్ నారాయణ, పల్లెపు అశోక్, తౌఫిక్ ఖాద్రీ, ఇలియస్, చిత్రం ప్రదీప్, బొడ్డుపల్లి కృష్ణ, బురాన్, బాబా, ఆఫ్రోజ్, జావిద్ ముక్తి, ఏఈ రాజు, అబ్దుల్ హక్, జాఫర్, తదితరులు పాల్గొన్నారు.