Huzurabad | తమను ధనికులుగా మార్చుతున్న టీఆర్ఎస్వెంటే దళితులంతా ఉన్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెప్పారు. బుధవారం ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయగణపతి, సర్పంచ్ దిలీప్ రెడ్డి సమక్షంలో ఆయన దళితులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులను ధనికులుగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈటల రాజేందర్ వెన్నుపోటుదారుడని, అభివృద్ధి అతనికి పట్టదని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలకు తాను ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.