MLA Rasamai Balakishan | మానకొండూర్ రూరల్ : ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను అణగదొక్కి, సమైక్యవాదులకు సద్దులు మోసిన రేవంత్రెడ్డి( Revanth Reddy )కి మాట్లాడే అర్హత లేదని, అతనో చిల్లర వ్యక్తి అని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్( MLA Rasamai Balakishan ) మండిపడ్డారు. సమైక్యవాదుల బూట్లు నాకిన రవ్వంత రెడ్డి(రేవంత్రెడ్డి), కామన్ సెన్స్ లేని కామంపల్లి (కవ్వంపల్లి) లాంటి చిల్లర మల్లర గాళ్ల మాటలను ప్రజలు ఎప్పటికీ నమ్మరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.500 వైద్యానికి రూ.50 వేల వసూలు చేసిన కవ్వంపల్లి కరీంనగర్, హైదరాబాద్లో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడని, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. చిల్లర గాళ్ల గురించి మాట్లాడే అవసరం తనకు లేదన్నారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణలు ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ లో భాగంగా మానకొండూరు సభలో చేసిన వ్యాఖ్యలు, ఇంకా మూడు అడుగుల వ్యక్తి రసమయి అని మాట్లాడడంపై ఎమ్మెల్యే బాలకిషన్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు.
మేధావుల మౌనం సమాజానికి హితం కాదని, సంసారం లేని వాళ్లే అలాంటి మాటలు మాట్లాడతారని పరోక్షంగా విమర్శించారు. ఇలాంటి కొత్త వేషగాళ్లు, పగటి బిచ్చగాళ్లు ఎంత మంది వచ్చినా రసమయి స్థానం చెక్కుచెదరదనీ వివరంచారు. కాంగ్రెస్ పార్టీ కథ ముగిసినట్లేనని, అరిగిపోయిన రికార్డులను ఎన్నిసార్లు వినిపిస్తారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.