హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ రేవంత్రెడ్డి అనే దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లిందని, ఆయన సైన్యం ఓ దొంగల ముఠాగా ఏర్పడిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ తన స్వార్థం కోసం, పదవుల కోసమే కాంగ్రెస్లో చేరాడని దుయ్యబట్టారు. రాజగోపాల్రెడ్డి శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
డబ్బులిచ్చి పీసీసీ పదవిని కొనుక్కొన్న చరిత్ర రేవంత్దని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గెలిస్తే రేవంతే సీఎం అంటున్నారని, ఆయన చంద్రబాబు ముద్దుబిడ్డ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో అవమానాలకు గురైన నేతలు బీజేపీలో చేరుతున్నారని, ముందస్తు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ తుడుచు పెట్టుకుపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడంపై తన సోదరుడు వెంకట్రెడ్డి సరైన సమయంలో నిర్ణయం తీసుకొంటారని చెప్పారు.