MLA Prashanth Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కుతోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను. అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడవద్దనే నిబంధన ఏదీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది. సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు. మేము మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు. సీఎం చెప్పేదొకటి చేసేదొకటి. అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు.. నియంత్రణ ఎలా పెడతారు. ఇలాంటి వాటిని తట్టుకుంటాం.. పోరాడతాం అని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..
– నేను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను
– అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదు
– కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది
– సీఎం… pic.twitter.com/WVjBzKAcEV— BRS Party (@BRSparty) February 14, 2024