హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరెందుకు మూసుకుంటున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్కు ప్రపంచ ఖ్యాతి ని తెచ్చిన చరిత్ర కాకతీయులదని, వారు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు లక్షలాది మందికి ఉపయోగపడుతున్నాయని, అ లాంటి కాకతీయుల కళాతోరణాన్ని రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి ఎందుకు తొలగిస్తారని బుధవారం ఓ ప్రకటనలో ప్ర శ్నించారు. కాకతీయుల స్ఫూర్తితో పోరాడి కళాతోరణాన్ని మళ్లీ అధికారిక చిహ్నంలో పెట్టిస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన రాజముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దుర్మార్గపు చర్య అని, ఇది క్రూరమైన ఆలోచనలతో తెలంగాణ ఆత్మపై దెబ్బకొట్టడమేనని అభిప్రాయపడ్డారు.