జనగామ : వైకల్యం అనేది శరీరానికే గానీ లక్ష్యానికి, మనసుకు కాదు అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ పాఠశాలలో చదివే దివ్యాంగులైన విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ విద్యా విధానలో సరికొత్త మార్పులు తీసుకొచ్చారన్నారు. గురుకుల పాఠశాలలు పెంచారు. ప్రభుత్వ బడుల్లో వసతులు, సౌకర్యాలు పెంచారు. సన్న బియ్యంతో భోజనం, రాగి జావ, నోట్ బుక్కులు ఉచితంగా అందజేస్తూ విద్యాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
అంతేకాదు, దివ్యాంగుల సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. తెలంగాణ ఎక్కడ ఉన్నది అనే స్థితి నుంచి ప్రపంచమంతా తెలంగాణ వైపే చూసే స్థితికి చేరిందన్నారు. తిండిలేక ఇబ్బందిపడ్డ తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాష్టాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, అన్ని వర్గాల అభివృద్ధికి పాటు పడుతున్న బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.