పెద్దపల్లి : కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు(Vijaya Ramana Rao) చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన నానిమినేషన్లో తప్పుడు పత్రాలు సమర్పించాడని వచ్చిన ఆరోపణలపై స్పందించిన తీరు విజయ రమణారావు ఆక్షేపనీయమని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి(MLA Manohar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
విజయ రామారావుపై ఫిర్యాదు చేసింది ఒక రైతు అని ఆయన పై వచ్చిన ఆరోపణలు తప్పని విజయ రమణారావు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ప్రతి వ్యక్తికి ఒక్క ఆధార్ కార్డు, ఒక్క పాన్ కార్డు ఉంటుంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావుకు రెండు పాన్ కార్డులు ఎందుకున్నాయో చెప్పాలి ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
విదేశీ బ్యాంకుల్లో వందల కోట్లు దాచుకున్నాడు. విదేశీ బ్యాంకు ఖాతాలు ఎందుకు ఉన్నాయి ? అవన్నీ ప్రజలకు వివరించాలన్నారు. నేను అంత సంస్కారం లేకుండా మాట్లాడలేనని, ప్రజలు నిబద్ధతకు ఓటు వేస్తారు..బీఆర్ఎస్ను గెలిపిస్తారని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.