మేడ్చల్ మల్కాజిగిరి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Dr. BR Ambedkar) ప్రపంచ మేధావి అని, ఆయన కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy) తెలిపారు. కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి వారం వారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్కు జ్ఞానమాల కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆదివారం 100వ వారం కావడంతో ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్కు జ్ఞానమాల కార్యక్రమాన్ని వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞశాలి అని కొనియాడారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన చెప్పినట్లుగా స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తోటకూర వజ్రేష్యాదవ్, మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మొరుగు రవీందర్, కీసర సర్పంచ్ నాయకపు మాధురి, కీసర ఎంపీటీసీ తటాకం నారాయణశర్మ, తదితరులు పాల్గొన్నారు.