హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి(CM Revanth reddy)పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) కీలక వ్యాఖ్యలపై చేశారు. రేవంత్ మార్క్ పాలపై హాట్ కామెంట్స్ చేశారు. రేవంతు అంటే నా వంతు ఏంది అంటున్నడని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకి పోయిన వాళ్లు నీ వంతుకు రేటెంత రెడ్డి(Commission Reddy) అని అడుగుతున్నారు. రేటెంత రెడ్డి రేట్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలీదు.
కానీ, ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పాలన గాలికి వదిలేసి వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు కొద్ది రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కొత్తగా ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇప్పటికే ‘ఆర్’ ట్యాక్స్ అమల్లో ఉన్నదని, తాను ఎందుకు సొంతంగా ట్యాక్స్ వసూలు చేయొద్దనే ఉద్దేశంతో ఓ మంత్రి ‘బీ’ ట్యాక్స్కు తెరలేపారన్నారు. కాంట్రాక్టర్ల నుంచి బిల్లులో 8-9 శాతం కమీషన్గా తీసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కొందరు కాంట్రాక్టర్లు తమకు చెప్పారన్నారు. ‘బీ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్ కాదు.. ఏం ట్యాక్సో నాకు తెలియదు. కొత్తగా వచ్చింది’ అని పేర్కొన్నారు. మంత్రులపై సీఎంకు ఎంత పట్టు ఉన్నదో అర్థం అవుతున్నదన్నారు.