హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. లాస్య నందిత మృతి బాధాకరమని మంత్రి చెప్పారు. ప్రమాద సమయంలో ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదని పోలీసులు చెప్పారని వెల్లడించారు.
లాస్య నందిత మృతదేహానికి గాంధీ దవాఖానలో పోస్టుమార్టం పూర్తిచేశారు. అనంతరం కార్ఖానాలోని నివాసానికి ఆమె పార్ధివదేహాన్ని తరలించారు. ఈస్ట్ మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో లాస్య నివాసానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.