KTR | రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘అధైర్య పడకండి.. అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో ఆయన పర్యటించారు. కొత్త జం టలను ఆశీర్వదిస్తూ, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తూ, గ్రామాల్లోని పలువురిని పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని దవాఖానలో చేర్పించి బాగుచేస్తానని హామీ ఇచ్చారు. ఉదయం 11:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చేరు కున్న కేటీఆర్.. సోషల్ మీడియా కార్యకర్త సాయికృష్ణ వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపా రు. అక్కడి నుంచి బొప్పాపూర్కు వెళ్లి నవదంపతులు ప్రశాంత్రెడ్డి, అఖిలను ఆశీర్వదించారు. అనంతరం రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు గుండాడి వెం కటరెడ్డి నివాసానికి చేరుకుని నాలుగు రోజుల క్రితం వివాహం చేసుకున్న నరేశ్రెడ్డి, చందన దంపతులను ఆశీర్వదించారు. ఎల్లారెడ్డిపేటలో నూతనంగా నిర్మించిన సహకార సంఘం భవనాన్ని సందర్శించారు.
సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డితోపాటు డైరెక్టర్లను అభినందించారు. హరిదాస్నగర్లో జడ్పీటీసీ సభ్యుడు చీటి లక్ష్మణ్రావు గృహప్రవేశానికి హాజరయ్యారు. అక్కడే జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మణ్రావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఇల్లెందుల శ్రీనివాస్రెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. అదే గ్రామంలో దళిత బంధు పథకంతో సమిష్టిగా ఏర్పాటుచేసిన ‘నయార’ పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. అక్కడి నుంచి ముస్తాబాద్ మండలం చేరుకుని అయ్యప్ప ఆలయంలో జరిగిన మహాపడి పూజలో పాల్గొని పూజలు చేశారు. అయ్యప్పలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ యూత్ నాయకుడు గుణశేఖర్ సోదరి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పోతుగల్ గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతంతో చనిపోయిన హెల్పర్ జంగ శ్రీనివాస్ కుటుంబసభ్యులను, గంభీరావుపేట మండలం శ్రీగాధలో పార్టీ సీనియర్ నాయకులు మాణిక్రావు, చొక్కారావు కుటుంబసభ్యులను, మండల కేంద్రంలోని ఎంపీటీసీ సభ్యుడు దేవేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకట్ యాదవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.