హైదరాబాద్ : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి రెడ్డి కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందాడు. వెంకట్రామిరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, వెంకట్రామిరెడ్డి అంతిమ సంస్కారాలు రేపు ఉదయం పది గంటలకు ధరూర్ మండలం బూరేడిపల్లిలో నిర్వహిస్తారు.