జోగులాంబ గద్వాల : గద్వాల(Gadwala) ప్రజల తాగునీటి(Drinking water) సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి9MLA Krishnamohan Reddy) సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జల దీక్ష(Jala Diksha) చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాగు, తాగు నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గద్వాల ప్రజల తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. కాగా, సాయంత్రం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు జల దీక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.