జోగులాంబ జగద్వాల : జిల్లాలోని గద్వాల నియోజకవర్గ పరిధిలోని మల్దకల్ మండలంలో వెలసిన శ్రీస్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నూతన ముఖద్వారం, అన్నదాన(Food shed) కార్యక్రమం షెడ్డును ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) ప్రారంభించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. అదే విధంగా దేవాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన అన్నదాన షెడ్డును మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత సత్య రెడ్డి తల్లిదండ్రులు వెంకటమ్మ, చిన్న వెంకట రెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పాటుచేసిన అన్నదానం షెడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..త్వరలో జరగబోయే జాతరను అంగరంగ వైభవంగా నిర్వహి స్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విక్రమ్ సింహారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మధు, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.