జోగులాంబ గద్వాల : దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లోకి వివిధ పార్టీలకు చెందిన పగటివేషగాళ్లు కుల, మతాల పేరుతో ఓట్లు దండుకోవడానికి వస్తున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మల్దకల్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, గార్లపాడు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
వారికి బీఆర్ఎస్ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీలోనే కార్యకర్తలకు సరైన గౌరవం లభిస్తుందన్నారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరే కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో లక్ష్మన్న, సంజీవులు, యాకోబు, దేవరాజు, జయన్న, వెంకటేశ్వర రెడ్డి, జనార్దన్ రెడ్డి, గోపాల్, శివ గౌడ్ ఉన్నారు.