సంగారెడ్డి : పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని మరోసారి నిరూపించారు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. జిల్లాలోని ఆందోల్ మండలం సాయిబన్ పేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
మంగళవారం ప్రవీణ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పరామర్శించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని స్వయంగా ప్రవీణ్ పాడే మోశారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.