KP Vivekananda | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR )కు జాతీయంగా, అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ( MLA KP Vivekananda Goud ) మండిపడ్డారు. కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ఎల్పీ( BRSLP )లో కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ కాంగ్రెస్( Congress ), బీజేపీ( BJP ) అధ్యక్షులు రేవంత్ రెడ్డి( revanth Reddy ), బండి సంజయ్( Bandi Sanjay ).. కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సంచలనాల కోసం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీకి సంబంధించి కేటీఆర్ అన్ని విషయాలు సమగ్రంగా చెప్పేసరికి రేవంత్ రెడ్డి అధికారులపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. ఆయా గ్రామాల్లో ఎంత మంది గ్రూప్-1 ఎగ్జామ్( Group 1 Exam ) రాశారో తెలియడానికి అధికారుల సాయం కావాలా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీకి ఏజెంట్లా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిట్ అధికారిని ఆంధ్రా అధికారి అని అనడం సరైంది కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి రేవంత్.. ఆయన ఇప్పుడు నీతులు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్పై అనర్హత వేటు వేసిన బీజేపీతో రాహుల్ కలిసిపోయాడని విమర్శించారు.
కేటీఆర్కు నీతులు బోధించే స్థాయి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్( MLA Raghunandan )కు లేదు అని కేపీ వివేకానంద స్పష్టం చేశారు. సంస్కారం నేర్పితే ముందుగా బండి సంజయ్కు రఘునందన్ నేర్పాలి. రఘునందన్ ఓ కాగితపు పులి అని విమర్శించారు. ఎక్కడ ఏ పని చేయాలో రఘునందన్కు తెలియదని కేపీ వివేకానంద పేర్కొన్నారు.