మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాతృ పాదపూజా మహోత్సవాన్ని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జేఎల్ఎన్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2023 మంది తల్లులకు వారి కొడుకులు, కూతుళ్లు కాళ్లు కడిగారు.
ఎమ్మెల్యే సైతం తన మాతృమూర్తికి పాదపూజ చేశారు. పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి మదర్ ఇండియా రికార్డ్సులో చోటుదక్కింది. సదరు సంస్థ ప్రతినిధులు గోదావరిఖనికి వచ్చి ఎమ్మెల్యేకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
– కోల్సిటీ