కుమ్రం భీం ఆసిఫాబాద్ : రాష్ట్రం ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్నదని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం కౌటాలలో దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4116 రూపాయలకు పెంచిన పింఛన్లను దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు. దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని వారికి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఒక్క పెన్షనే కాకుండా దివ్యాంగులకు సహకార సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. కాగా, దేశంలోఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తం పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీలు దివ్యాంగులను ఏనాడూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం. వచ్చే ఎన్నికల్లో అభివృవృద్ధిని చూసి ఆదరించాలని ఆయన కోరారు.