హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తన నియోజకవర్గానికి చెంది న చలమల కృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయనకు అసలు వ్యక్తిత్వమే లేదని విమర్శించారు. తనపై అడ్డగోలుగా మాట్లాడిన వ్యక్తిని తనకు తెలియకుండా ఎలా చే ర్చుకుంటారని ప్రశ్నించారు. శాసనసభ లాబీల్లో శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ తనకు తెలియకుండానే చలమలను చేర్చుకున్నారని, ఆయన చేరిక చెల్లదని పేర్కొన్నారు. అసలు ఆయన రాజకీయాలకే పనికిరాడని విమర్శించారు. తనవల్ల కాంగ్రెస్కే లాభమని, అందుకే వారు పిలిస్తేనే పార్టీలో చేరి మునుగోడులో గెలిచి వచ్చానని తెలిపారు. తనవల్ల లాభపడుతుందనే కాంగ్రెస్ తనను పిలిచి చేర్చుకున్నదని, కానీ చలమల వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగమూ ఉండదని స్పష్టం చేశారు. డబ్బుతో ఆయన రాజకీయం చేయాలని అనకుంటున్నాడని మండిపడ్డారు.