యాదాద్రిభువనగిరి : ప్రభుత్వం జారీ చేసిన నూతన రేషన్ కార్డులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లాలోని అడ్డగుడూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 269 అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించొద్దనే ప్రభుత్వుం రేషన్ కార్డులు అందజేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆకలి కేకలు లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత