నిజామాబాద్ : గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 3 వేల కోట్ల రూపాయలతో కనీవినీ ఎరగని రీతిలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ది(CM KCR) అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి(MLA Jeevan Reddy )అన్నారు. శుక్రవారం ఆర్మూర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు ఆర్మూర్ ఎంతో వెనుకబడి ఉండేది.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. ఆర్మూర్ వెనుకబడింది అంటే ఒక్క జీవోతో 72 పథకాలు మంజూరు చేసిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డుకు రూ.20 కోట్లు కేటాయించారు.
అలాగే వంద పడకల దవాఖానను కేటాయించారు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, రూ.500 కోట్లతో సాగు, తాగు నీటి గోస తీర్చి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.