కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 3,500 మందికి పోడు భూముల పట్టాలు అందజేసినట్టు ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. బుధవారం ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో గాంధారి మండలానికి చెందిన 102 మంది, రాజంపేట మండలానికి చెందిన 50 మంది గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గిరిజనుల జీవితాల్లో మార్పు రాలేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వారి బతుకుల్లో వెలుగులు నింపినట్టు చెప్పారు.
– ఎల్లారెడ్డి రూరల్